కవితను చూస్తే నవ్వొస్తుంది : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో పెద్దఎత్తున చేరుతున్నారని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. పార్టీలో చేరిన వారందరికీ హృదయ పూర్వక స్వాగతం తెలిపారు

By Medi Samrat  Published on  9 March 2024 10:20 AM GMT
కవితను చూస్తే నవ్వొస్తుంది : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో పెద్దఎత్తున చేరుతున్నారని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. పార్టీలో చేరిన వారందరికీ హృదయ పూర్వక స్వాగతం తెలిపారు. గాంధీ భవన్ లో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం గత మూడు నెలలుగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజల్లో మంచి స్పందన వ‌స్తుంద‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విస్తృత స్థాయి కార్యక్రమాలతోనే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కాంగ్రెస్ లోకి వస్తున్నారని తెలిపారు. పార్టీలోకి వ‌స్తున్న వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుంది.. ఎవరికి ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలో అలాగే ఇస్తామ‌ని తెలిపారు.

పాత నాయకులు, కొత్త నాయకులు కలిసికట్టుగా పని చేసి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి కృషి చేయాల‌న్నారు. కేసీఆర్ కూతురు కవిత ధర్నా చౌక్ వద్ద నిన్న శివరాత్రి రోజున ధర్నా చేసింది. ఆమె వైఖరి చూస్తే నవ్వొస్తుందన్నారు. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి పుణ్యం కోసం తీర్థ యాత్రలకు పోయినట్టుంది కవిత వైఖరి అని ఎద్దేవా చేశారు. ఇంతకాలం పక్కన పెట్టిన జాగృతిని మళ్ళీ తెరిచిందన్నారు. తెలంగాణ జాగృతి పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం లో ఏనాడైనా మహిళల గురించి మాట్లాడిందా అని ప్ర‌శ్నించారు. ఎన్నడూ గుర్తుకు రాని మహిళలు పదవి పోగానే కవితకు గుర్తుకు వచ్చారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి పనులు చేస్తున్నామ‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదట అమలు చేసిన ఉచిత బస్ సౌకర్యం మహిళల కోసమేన‌న్నారు. మహిళలకు 500 రూపాయలకు గ్యాస్ పథకం, ఉచిత గృహ విద్యుత్ అన్ని పథకాలు మహిళ కోసమేన‌న్నారు. కవిత మహిళల కోసం ఎలాంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.

Next Story