ఎంపీ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

MP Kavitha To Be Jailed For Six Months. టీఆర్ఎస్ మ‌హిళా నాయ‌కురాలు, మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవితకు ప్రజాప్రతినిధుల

By Medi Samrat  Published on  24 July 2021 12:24 PM GMT
ఎంపీ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

టీఆర్ఎస్ మ‌హిళా నాయ‌కురాలు, మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. కవితకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. 2019లో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బు పంచారన్న కేసులో.. ఎంపీ కవితపై బూర్గంపహాడ్‌ పోలీసస్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కవితకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు మేరకు రూ. 10వేల జరిమానాను ఎంపీ చెల్లించారు. అనంతరం ఆమెకు ప్రజాప్రతినిధుల కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.


Next Story