దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని బీజేపీ దౌర్జన్యాలకు పాల్పడుతుంది

బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

By Medi Samrat  Published on  22 March 2024 1:00 PM GMT
దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని బీజేపీ దౌర్జన్యాలకు పాల్పడుతుంది

బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ బాండ్ల పేరిట, ఫండ్స్ పేరిట ఇబ్బంది పెడుతూ వేల కోట్లు దండుకుంటుందని.. కాంగ్రెస్ పార్టీకి చెందిన 4 బ్యాంక్ లలో 11 అకౌంట్స్ ని సీజ్ చేసిందని ఆరోపించారు.

రూ. 210 కోట్ల డొనేషన్ లో 14 లక్షల క్యాష్ లావాదేవీలు జరిపిందనే చిన్న కారణంతో అకౌంట్స్ సీజ్ చేసిందని.. పార్లమెంట్ ఎన్నికల ముందు అకౌంట్స్ సీజ్ చేసి ఖాతాలో ఉన్న డబ్బులు వాడుకోకుండా ఆంక్షలు విధించిందని ఆరోపించారు.

రాజకీయ దురుద్దేశంతోనే ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్నారు. దేశ చరిత్రలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇన్ కమ్ టాక్స్ కట్టిన చరిత్ర లేదన్నారు. ఎలెక్ట్రోల్ బాండ్స్ విషయంలో బీజేపీ పెద్ద స్కామ్ చేసిందని.. కేంద్రానికి ఈసీ, సుప్రీం కోర్ట్ మొట్టికాయలు వేసిందన్నారు. 50% పైగా ఎలెక్ట్రోల్ బాండ్స్ డబ్బు బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది.. మేఘా కంపెనీ 170 కోట్లు ఎలెక్ట్రోల్ బాండ్స్ బీజేపీకి ఇచ్చిందన్నారు.

తొమ్మిదిన్నర ఏండ్లలో బీజేపీ డొనేషన్స్ 10 రేట్లు పెరిగిందన్నారు. దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని బీజేపీ దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆరోపించారు. మతం, దేవుళ్లు, అక్షింతల పేరిట మళ్ళీ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం హయాంలో పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చిందన్నారు. పేదలకు అన్యాయం చేసిన‌ బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Next Story