మిషన్ భగీరథ పెద్ద స్కామ్ : జీవన్ రెడ్డి

బీఆర్ఎస్ నేతలకు ఇంకా జ్ణానోదయం కలగలేదని.. ఓటమిని అంగీకరించే పరిస్థితిలో కేటీఆర్ లేడని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  12 Jan 2024 8:36 AM GMT
మిషన్ భగీరథ పెద్ద స్కామ్ : జీవన్ రెడ్డి

బీఆర్ఎస్ నేతలకు ఇంకా జ్ణానోదయం కలగలేదని.. ఓటమిని అంగీకరించే పరిస్థితిలో కేటీఆర్ లేడని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో శుక్ర‌వారం ఆయ‌న మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదన్నారు. మిషన్ భగీరథ పెద్ద స్కాం అని ఆరోపించారు. కాళేశ్వరం రీ డిజైన్ పెద్ద బోగస్ అని.. కేవలం కమీషన్ ల కోసం రీ డిజైన్ చేశార‌ని మండిప‌డ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ ను ఎస్సీ డెవల్మెంట్ ఫండ్ గా మార్చి నిధులను మళ్ళించిందని.. నిధుల దారి మళ్ళింపును చర్చకు రాకుండా చేసేందుకు దళిత బంధును తెరపైకి తెచ్చారని ఆరోపించారు.

గిరిజనులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిండా ముంచింది.. అందుకే వాళ్ళు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ బంధుల పేరుతో ఎన్నికల ముందు హాడావిడి చేశార‌ని అన్నారు. బీఆర్ఎస్ పరోక్ష మిత్ర పక్షంగా భావిస్తున్న బీజేపీ పక్కలో బల్లంలా కాచుకుని ఉందని విమ‌ర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు రావని జోష్యం చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చడం కాదు.. నాయకుడిని మార్చాలి అన్నారు.

Next Story