రామచంద్ర భారతికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

MLAs poaching case. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో రామచంద్ర భారతికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

By Medi Samrat  Published on  21 Nov 2022 12:15 PM GMT
రామచంద్ర భారతికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో రామచంద్ర భారతికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. త‌న‌కు విధించిన రిమాండ్ ను సవాల్ చేస్తూ రామచంద్ర భారతి వేసిన పిటిషన్ ను కొట్టేసింది. ట్రయల్ కోర్టు విధించిన ఉత్తర్వులకు అనుగుణంగా బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. తమపై ఉన్న కేసును కొట్టివేయాలని నిందితులు రామచంద్ర భారతితో పాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. రామచంద్ర భారతి పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం న్యాయస్థానం విముఖత చూపింది. ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించే హక్కు ఉందని పేర్కొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలను ప్రలోభ పెట్టి బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం చేశారనే ఆరోపణలతో రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.


Next Story