అందరి ముందు క‌న్నీళ్లు పెట్టుకున్న‌ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

MLA Kusukuntla Prabhakar Reddy Crying In Meeting. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.

By M.S.R  Published on  18 April 2023 2:00 PM GMT
అందరి ముందు క‌న్నీళ్లు పెట్టుకున్న‌ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

MLA Kusukuntla Prabhakar Reddy

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. చౌటుప్పల్ మండలంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి హరీశ్ రావుకు తనకు మధ్య ఉన్న అనుభందం గురించి మాట్లాడుతూ.. కాస్త ఎమోషనల్ అయ్యారు. హరీశ్ రావు తనకు చేసిన సహకారం గురించి తలుచుకుంటూ ప్రభాకర్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న హరీశ్ రావు కూసుకుంట్లను ఓదార్చే ప్రయత్నం చేశారు. 2003లో కళ్లెం యాదగిరి రెడ్డి తనను హరీశ్ రావుకు పరిచయం చేసి టీఆర్ఎస్ లో చేర్పించారని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు హరీశ్ రావు తనకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా చేశారన్నారు.

చౌటుప్పల్ లోని 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రూ.36 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సమయంలో చండూర్‌ బహిరంగ సభలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి కావాలని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన అభ్యర్థన మేరకు వంద పడకలకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేసినట్లు గుర్తు చేశారు హరీష్ రావు.



Next Story