10 శాతం మాత్రమే మహిళలు.. కేటీఆర్ మాటే ఇది..!

Ministers KTR About Women Entrepreneurs. కేవలం 10 శాతం మాత్రమే మహిళలు పారిశ్రామిక రంగంలో ఉంటున్నారని....కేటీఆర్

By Medi Samrat  Published on  10 March 2021 8:59 AM GMT
Ministers KTR About Women Entrepreneurs
ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ నియమితులయ్యారు. తెలంగాణ అభివృద్ది కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకు వస్తున్నారు. ఆయన తనయుడు కేటీఆర్ మంత్రి అయ్యాక తెలంగాణలో పలు దేశాలు పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నాలు కొనసాగిస్తూ వస్తున్నారు. టెక్నాలజీ రంగంలో తెలంగాణను ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ కంపెనీలు తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వ భాగస్వామ్యంతో మహిళా ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు అప్ సర్జ్ పేరుతో నిర్వహించనున్న ప్రీ-ఇంక్యూబేషన్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఆయనతో పాటు భారత్ లోని ఆస్ట్రేలియా హై కమిషనర్ బ్యారీ ఓఫెరెల్ హాజరయ్యారు.


ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. కేవలం 10 శాతం మాత్రమే మహిళలు పారిశ్రామిక రంగంలో ఉంటున్నారని.. ప్ర‌తిభ ఉన్న మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు రాష్ర్ట ప్ర‌భుత్వం చేయూత‌నిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇక చాలా తక్కువ కంపెనీలు పెట్టుబడులు పొందుతున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వాల కృషి పెరగాల్సి ఉందని... ప్రైవేటు పెట్టుబడులు రానట్లయితే ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టాల్సి ఉందని పేర్కొన్నారు. వీ-హబ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని.. ప్రస్తుతం నాయకత్వ స్థాయిలో ఉందని అన్నారు.

ఇతర రాష్ట్రాల్లో మహిళా ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు అక్కడి ప్రభుత్వాలతో కలిసి పనిచేసిందన్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం వీ-హబ్ కు మంచి సపోర్ట్ ఇచ్చిందని.. దీని వల్ల రెండు దేశాల మార్కెట్లకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. గ‌తంలో వీ-హ‌బ్ ద్వారా గుజ‌రాత్‌, క‌శ్మీర్‌తో భాగ‌స్వామ్యం ఏర్ప‌రుచుకున్నామ‌ని గుర్తు చేశారు. వీ-హబ్ ద్వారా ఆస్ట్రేలియాకు చెందిన కంపెనీలు ఇండియాకు వచ్చేందుకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.



Next Story