రైతు భరోసా విడుదలపై మంత్రి వివేక్ కీలక ప్రకటన

తెలంగాణలో రైతు భరోసా నిధుల కోసం వేచి చూస్తున్న రాష్ట్ర రైతులకు మంత్రి వివేక్ తీపి కబురు అందించారు.

By -  Knakam Karthik
Published on : 12 March 2026 7:10 AM IST

Telangana, RythuBharosa, Farmers, MinisterVivek, Telangana Government

రైతు భరోసా విడుదలపై మంత్రి వివేక్ కీలక ప్రకటన

తెలంగాణలో రైతు భరోసా నిధుల కోసం వేచి చూస్తున్న రాష్ట్ర రైతులకు మంత్రి వివేక్ తీపి కబురు అందించారు. చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఆయన, ఈ నెల నుంచే రైతు భరోసా పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

ఈ పథకం కింద మొత్తం రూ. 9,000 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. ఈ నిధులను రెండు విడతలుగా విడుదల చేయనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా తొలి విడతగా ఈ మార్చి నెలలో రూ. 4,500 కోట్లను, మిగిలిన సగం నిధులను వచ్చే నెలలో రైతుల ఖాతాలకు బదిలీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Next Story