హైదరాబాద్: రాష్ట్రంలో బాల భరోసా పేరుతో ఓ పథకం ప్రారంభిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. దీని ద్వారా ఐదేళ్ల లోపు పిల్లలకు అవసరమైన చికిత్స చేయిస్తామన్నారు. నిన్న సీఎస్ రామకృష్ణారావుతో కలిసి జిల్లాల కలెక్టర్లతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అటు 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను నవంబర్లోపు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. స్కూళ్లు ప్రారంరభించిన రోజే విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేస్తామని, కొత్తగా వెయ్యి అంగన్వాడీ భవనాలు నిర్మిస్తామని ఆమె వెల్లడించారు.
ప్రైవేట్ ప్లే స్కూళ్లకు ధీటుగా అంగన్వాడీ స్కూళ్లను నిర్మించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అర్హులైన మహిళలను స్వయం సహాయక సంఘాల్లో (ఎస్హెచ్జీ) చేర్పించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కలెక్టర్లను ఆదేశించారు. అక్టోబర్ 2 నాటికి మహిళా సంఘాలతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయించాలని సూచించారు. 22 జిల్లాల్లో చే పట్టిన ఇందిరా మహిళా శక్తి భవనాలను పూర్తిచేయాలని కోరారు. అంగన్వాడీ సెంటర్లలో పిల్లల నమోదును పెంచాలన్నారు.