బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని.. ఇంచార్జ్ మంత్రిగా అనేక సార్లు మాగంటిని కలిశానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షిణించడంతో ప్రభుత్వ కార్యమాలకు రావడం లేదని.. ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన సమయం అన్నారు. బీఆర్ఎస్ నాయకులు మాగంటి గోపీనాథ్ అనారోగ్య సందర్భాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు.
బోరబండలో బీఆర్ఎస్ కార్యకర్త మరణంతో మాగంటి గోపీనాథ్ అనారోగ్యం పాలయ్యారని మాట్లాడుతున్నారు.. కార్యకర్త మరణంతో ఎమ్మెల్యేమాగంటి గోపీనాథ్ అనారోగ్యానికి లింక్ చేయడం సరైన సందర్భం కాదన్నారు. అనారోగ్యంతో బాధ పడుతున్న మాగంటి గోపీనాథ్ అంశంతో రాజకీయాలు చేయడం సబబు కాదన్నారు. రాజకీయ కక్షతో బీఆర్ఎస్ కార్యకర్త మరణాన్ని అక్కడి స్థానిక నేత బాబా ఫసియుద్దీన్కు అపాదిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చారనే అక్కసుతోనే ఆరోపణలు చేస్తున్నారన్నారు.