హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదు : మంత్రి పొన్నం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.9 అమలును నిలిపివేస్తూ.. హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

By -  Medi Samrat
Published on : 9 Oct 2025 5:30 PM IST

హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదు : మంత్రి పొన్నం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.9 అమలును నిలిపివేస్తూ.. హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విష‌య‌మై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తరువాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామ‌న్నారు. ప్రభుత్వం తరుపున బలమైన వాదనలు వినిపించడం జరిగిందన్నారు.

ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్ వేసి, సబ్ కమిటీ వేసి కేబినెట్ ఆమోదించి, శాసన సభలో చట్టం చేసి గవర్నర్‌కు పంపడం జరిగింది.. 2018 పంచాయతీ రాజ్ చట్ట సవరణ చేశాం.. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు రావడం లేదన్నారు. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉంద‌న్నారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీఆర్ఎస్‌, బీజేపీలు హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో జవాబు చెప్పాలన్నారు. మా నాయకుడు రాహుల్ గాంధీ నాయక్వతంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తామ‌న్నారు.

Next Story