ఆ రెండు కుటుంబాలకు కోటిన్నర చొప్పున అందజేస్తాం : కేటీఆర్‌

Minister KTR condoles the death of Kusuma Jagdish and Sai Chandu. టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కుసుమ జగదీష్, వేద సాయి చంద్ అకాల మరణానికి మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు

By Medi Samrat  Published on  7 July 2023 11:16 AM GMT
ఆ రెండు కుటుంబాలకు కోటిన్నర చొప్పున అందజేస్తాం : కేటీఆర్‌

టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కుసుమ జగదీష్, వేద సాయి చంద్ అకాల మరణానికి మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నాయకులు అకాల మరణం చెందడం పట్ల కేసీఆర్‌ ను ఎంతగానో కలచివేసింద‌న్నారు. వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని, వారి యోగక్షేమల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర 150 మందికి పైగా ప్రజాప్రతినిధుల ఒక నెల జీతం సుమారు మూడు కోట్లకు పైగా ఆ రెండు కుటుంబాలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఇరు కుటుంబాలకు కోటిన్నర చొప్పున అందిస్తామ‌ని వెల్ల‌డించారు.

కుసుమ జగదీష్, సాయి చందుల‌ తల్లిదండ్రులను పార్టీ తరఫున కూడా ఆదుకుంటామని పేర్కొన్నారు. సాయిచంద్ సతీమణి రజినీకి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని వెల్ల‌డించారు. పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తల శ్రమ, త్యాగాల వలన పార్టీ నిర్మాణమైందని వెల్ల‌డించారు.




Next Story