తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ మీటింగ్కు వెళ్తూ కళ్లు తిరిగి ఆమె కింద పడిపోయారు. ఈ ఘటన సచివాలయం ఆరో అంతస్తులో చోటు చేసుకోగా, అక్కడే ఉన్న ఎమర్జెన్సీ మెడికల్ టీం మంత్రికి ప్రథమ చికిత్స అందించారు. లో బీపీ కారణంగా కళ్లు తిరిగిపడిపోయారు. కొండా సురేఖ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు.