రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే తెలంగాణ‌ను అవ‌మానిస్తున్నారు : అక్బ‌రుద్దీన్ ఓవైసీ

కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిన శ్వేతపత్రంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ స్పందించారు.

By Medi Samrat  Published on  20 Dec 2023 1:20 PM GMT
రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే తెలంగాణ‌ను అవ‌మానిస్తున్నారు : అక్బ‌రుద్దీన్ ఓవైసీ

కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిన శ్వేతపత్రంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ స్పందించారు. రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే తెలంగాణ‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవ‌మానిస్తున్నారని.. తెలంగాణ ప‌రువు తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారన్నారు. రాజ‌కీయాల కంటే రాష్ట్ర స‌మ‌గ్ర‌త‌ను కాపాడ‌టం మ‌న మొద‌టి క‌ర్త‌వ్యం అయి ఉండాలి అని అక్బ‌రుద్దీన్ అన్నారు.

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు స‌హ‌జ‌మే కానీ రాజ‌కీయ ల‌బ్ది కోసం విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాదన్నారు. తెలంగాణ ముమ్మాటికీ లాభ‌దాయ‌క రాష్ట్ర‌మే అని అక్బ‌రుద్దీన్ చెప్పుకొచ్చారు. తెలంగాణ వ‌స్తే అంధ‌కార‌మేన‌ని గ‌తంలో కిర‌ణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ వ‌చ్చాక విద్యుత్, తాగునీరు.. అన్నీ వ‌చ్చాయి. అప్పులు పెరిగినా.. అభివృద్ధి కూడా గ‌ణ‌నీయంగా జ‌రిగిందని అన్నారు అక్బ‌రుద్దీన్ ఓవైసీ. 55 సంవత్సరాలలో జ‌ర‌గ‌ని అభివృద్ధి ఈ పది సంవత్సరాల కాలంలో జ‌రిగిందన్నారు. రాష్ట్రంలోనే కాదు.. కేంద్రంలోనూ అప్పులు పెరిగాయన్నారు. శ్వేత‌ప‌త్రం విడుద‌ల వెనుక ఉద్దేశం ఏంటో ప్ర‌భుత్వం చెప్పాలన్నారు.

Next Story