సినీ నటుడు మంచు విష్ణు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనపై 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో నమోదైన ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసును కొట్టివేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ఈరోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
2019 సాధారణ ఎన్నికల సందర్భంగా మంచు విష్ణు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై ప్రాథమిక విచారణ జరిపింది. ఈ కేసులో తదుపరి విచారణను జులై 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది.
ఇక ‘కన్నప్ప’ చిత్రానికి సంబంధించి ఓ హార్డ్ డ్రైవ్ మిస్ కావడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ డ్రైవ్లో సినిమాలోని పలు కీలక సన్నివేశాలు ఉన్నట్లు వారు తెలిపారు. ఈ సినిమాను లీక్ చేసేందుకు సినీ ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులు కుట్ర చేస్తున్నారని.. ఇది నిజంగా బాధాకరం అని చిత్ర యూనిట్ చెబుతోంది.