'మన ఊరు-మన బడి' పథకం.. నాణ్యమైన విద్యను మెరుగుపరుస్తుంది: మంత్రి కేటీఆర్

Mana Ooru-Mana Badi will improve quality of education.. Minister KTR. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యను మెరుగుపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా

By అంజి  Published on  29 Jan 2022 8:33 AM GMT
మన ఊరు-మన బడి పథకం.. నాణ్యమైన విద్యను మెరుగుపరుస్తుంది: మంత్రి కేటీఆర్

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యను మెరుగుపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'మన ఊరు-మన బడి'ని చేపడుతోందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కెటి రామారావు అన్నారు. "ఆరోగ్యం, విద్యపై వెచ్చించే డబ్బు వల్ల పేదలపై ఆర్థిక భారం ఎక్కువగా ఉంది. నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు బస్తీ దవాఖానాలు, ఆసుపత్రులు నిర్మిస్తున్నారు. 7,289 కోట్లతో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 'మన ఊరు-మన బడి' ప్రారంభిస్తున్నామని చెప్పారు.

జలపల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు నీటి ఎద్దడి తమను వెంటాడేదని జలపల్లి ప్రజాప్రతినిధులు మంత్రికి తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఈ ప్రాంత ప్రజలు తాగునీటి ఎద్దడితో ఇబ్బందులు పడేవారని, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టిన తర్వాత ఇంటింటికీ తాగునీరు అందజేస్తున్నారని జల్‌పల్లి ఛైర్మన్‌ తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Next Story