రేవంత్ చిట్టాపై ఈడీ, సీబీఐకి కంప్లైంట్ చేస్తా : కొత్త మనోహర్ రెడ్డి

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ బ‌హిష్కృత‌ నేత కొత్త మనోహర్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

By Medi Samrat  Published on  2 Oct 2023 12:45 PM GMT
రేవంత్ చిట్టాపై ఈడీ, సీబీఐకి కంప్లైంట్ చేస్తా : కొత్త మనోహర్ రెడ్డి

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ బ‌హిష్కృత‌ నేత కొత్త మనోహర్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నాడ‌ని ఆరోపించారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి దగ్గర 6 కోట్లు, గాలి అనిల్ కుమార్ దగ్గర రేవంత్ రెడ్డి 12 కోట్ల రూపాయలు తీసుకున్నాడ‌ని.. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకుంటూన్నాడని కొత్త మనోహర్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

నేను చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించాలంటే.. భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేయాలని రేవంత్ రెడ్డికి కొత్త మనోహర్ రెడ్డి సవాల్ విసిరారు. నేను సీఎం అవుతా నీకు రెవెన్యూ మంత్రి ఇస్తా అని గాలి అనిల్ కుమార్ దగ్గర 12 కోట్లు తీసుకున్నాడని ఆరోపించారు. రేవంత్ ఇలా చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నాడని.. ఆ చిట్టా అంతా ఈడీకి, సీబీఐకి ఇచ్చి కంప్లైంట్ చేస్తాన‌ని పేర్కొన్నారు.

రేవంత్ ఏమీ సొక్కమైన వ్యక్తి కాదు.. గతంలో ఓటుకు నోటు కేసులో 50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తివి నువ్వు.. నీకు ఇది కొత్తేం కాదని విమ‌ర్శించారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళనే సర్వేలో చూపిస్తూ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేస్తున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Next Story