భువ‌న‌గిరి కోట‌పై లోక్‌స‌భ‌లో గ‌ళం విప్పిన ఎంపీ

Komatireddy Venkat Reddy. భువ‌న‌గిరి కోట‌ అభివృద్ధికి నిధులు కేటాయించాల‌ని.. కేబుల్ కార్ (రోప్‌వే) నిర్మాణం చేప‌ట్టాల‌ని

By Medi Samrat  Published on  3 Aug 2021 1:10 PM GMT
భువ‌న‌గిరి కోట‌పై లోక్‌స‌భ‌లో గ‌ళం విప్పిన ఎంపీ

భువ‌న‌గిరి కోట‌ అభివృద్ధికి నిధులు కేటాయించాల‌ని.. కేబుల్ కార్ (రోప్‌వే) నిర్మాణం చేప‌ట్టాల‌ని లోక్‌స‌భ‌లో భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ప్ర‌స్తావించారు. ఎంతో గొప్ప చరిత్ర క‌లిగిన భువ‌న‌గిరి కోట‌పై కేబుల్ కార్ (రోప్‌వే) నిర్మించడంతో పాటు.. కోట అభివృద్దికి అవ‌స‌ర‌మైన నిధులు కేటాయించాల‌ని ప్ర‌ధాన మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. భువ‌న‌గిరి కోట నిర్మాణం అద్భుతంగా ఉండ‌డంతో పాటు.. ప‌ర్యాట‌క ప్రియులను, ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడ‌లు ఆడే వారికి వీలుగా ఉంటుందని తెలిపారు. కోట‌కు రోడ్డు, రైలు ద్వారా ర‌వాణా సౌక‌ర్యం క‌లిగి ఉండి.. రాష్ట్ర రాజ‌ధానికి కేవ‌లం 48 కిలోమీటర్ల దూరంలో ఉంద‌ని వివ‌రించారు.

పర్యాటకుల సౌకర్యార్థం కోటకు కేబుల్ కార్ (రోప్ వే) వేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. టెండ‌ర్లు పిల‌వ‌డం వాటిని ర‌ద్దు చేయ‌డం జరిగింద‌న్నారు. 2016లో రెండ‌వ‌సారి టెండ‌ర్లు పిలిచి ఎలాంటి కార‌ణాలు లేకుండా.. ప్ర‌భుత్వం టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేసింద‌ని వివ‌రించారు. రాష్ట్ర స‌ర్కార్ కోట అభివృద్దిపై ఆల‌స‌త్వం వ‌హిస్తుంద‌ని వెల్ల‌డించారు. దేశంలోని సంస్కృతి వార‌సత్వ సంప‌ద‌ను ర‌క్షించ‌డానికి ప్ర‌ధాని మోదీ కంకణం క‌ట్టుకుంటే.. భువ‌న‌గిరి కోట అభివృద్దికి కావాల్సిన నిధుల‌ను కేంద్రం మంజూరు చేయాల‌ని కోరారు.


Next Story