కేసీఆర్‌తో పోలుస్తూ.. కోహ్లీని పొగిడిన కవిత.. కాంగ్రెస్‌ సెటైర్‌

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కే కవిత బుధవారం క్రికెటర్ విరాట్ కోహ్లీని తన తండ్రితో పోలుస్తూ ప్రశంసించారు.

By అంజి  Published on  16 Nov 2023 9:00 AM GMT
KCR, Virat Kohli,   Congress, MLC Kavitha

కేసీఆర్‌తో పోలుస్తూ.. కోహ్లీని పొగిడిన కవిత.. కాంగ్రెస్‌ సెటైర్‌

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె కే కవిత బుధవారం క్రికెటర్ విరాట్ కోహ్లీని తన తండ్రితో పోలుస్తూ ప్రశంసించారు. "సీఎం కేసీఆర్ లాగానే విరాట్ కోహ్లీ కూడా ఓడలేడు! మాస్టర్స్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు మ్యాజిక్ జరుగుతుంది!" ఎక్స్ (గతంలో ట్విట్టర్)కి పోస్టు చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకురాలు కవిత షేర్‌ చేసిన ఫొటోలో క్రికెట్‌లో కొహ్లీకి తిరుగులేదు, తెలంగాణలో కేసీఆర్‌కు ఎదురు లేదు అని ఉంది.

బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ విజయం సాధించిన తర్వాత 2023 ప్రపంచ కప్ ఫైనల్స్‌లోకి ప్రవేశించిన తర్వాత ఆమె పోస్ట్ వచ్చింది. విరాట్ కోహ్లీ తన 50వ వన్డే సెంచరీని సాధించి భారత మాజీ గ్రేట్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ఈ పోస్ట్‌పై తెలంగాణ కాంగ్రెస్ స్పందిస్తూ.. 'దేశం కోసం ఆడటానికి, కమీషన్ల కోసం ఆడటానికి తేడా ఉంది' అని కవితపై మండిపడింది. క్రికెట్ లో కోహ్లీ కి తిరుగులేదు.. కాళేశ్వరం కుంభకోణంలో కేసీఆర్‌ను మించినోళ్లు లేరని.. మరో పోస్ట్‌లో కాంగ్రెస్ పేర్కొంది.

''భారతీయులంతా ఏకమయ్యారు.. టీమ్ ఇండియా గెలుపు కోసం.. తెలంగాణ ప్రజలంతా ఏకమవుతారు.. కాంగ్రెస్ గెలుపు కోసం..'' అని తెలంగాణ కాంగ్రెస్‌ మరో పోస్ట్ చేసింది. నవంబరు 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Next Story