కాళేశ్వరం కమిషన్ ఎదుట 50 నిమిషాలు..ముగిసిన కేసీఆర్ విచారణ
కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది.
By Knakam Karthik
కాళేశ్వరం కమిషన్ ఎదుట 50 నిమిషాలు..ముగిసిన కేసీఆర్ విచారణ
కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు మాజీ సీఎంను కాళేశ్వరం కమిషన్ ఇంటరాగేషన్ చేసింది. తనకు స్వల్ప అనారోగ్యం ఉందని కమిషన్ చైర్మన్ చంద్రఘోష్కు కేసీఆర్ తెలిపారు. అనారోగ్యం కారణంగా ఓపెల్ హాలులో ఫేస్ టూ ఫేస్ విచారణ కాకుండా.. వ్యక్తిగతంగా వన్ టూ వన్ ఇన్ కెమెరా విచారణను ఆయన కోరారు. కేసీఆర్ అభ్యర్థనను అంగీకరించిన జస్టిస్ పీ చంద్రఘోష్ ఓపెన్ కోర్టు హాలు నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మీడియాతో సహా అందరినీ బయటకు పంపి విచారణ ప్రారంభించారు.
దాదాపు 14 నెలల పాటు ఇప్పటి వరకు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, మాజీ మంత్రులను విచారించిన కమిషన్ వారిచ్చిన స్టేట్మెంట్ను బేస్ చేసుకుని కేసీఆర్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కేసీఆర్ను 115వ సాక్షిగా కాళేశ్వరం కమిషన్ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, తీసుకున్న నిర్ణయాలపైనే ప్రధానంగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో తాగు, సాగు నీటి పరిస్థితులతో పాటు భారతదేశంలో నీటి లభ్యత, వినియోగంపై కమిషన్కు మాజీ సీఎం వివరిచారని సమాచారం. కాళేశ్వరంతో పాటు అనుబంధ ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లు పీసీ ఘోష్ కమిషన చైర్మన్ పీ చంద్రఘోష్కు కేసీఆర్ అందజేశారు.
ఇటీవల మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావులను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను 50 నిమిషాల పాటు విచారించింది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు గతేడాది మార్చిలో కాళేశ్వరం కమిషన్ ను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఈ కమిషన్ ను ఏర్పాటు చేసింది.