ఆ 100 కుటుంబాల్లో సీఎం ముందే పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు
KCR brought festive atmosphere to 100 Dalit families before Ugadi. తెలంగాణలో తెలుగు సంవత్సరాది వేడుకలకు ఒక్కరోజు ముందు సీఎం కేసీఆర్ 100 దళిత కుటుంబాల్లో
By Medi Samrat Published on 1 April 2022 3:30 PM GMT
తెలంగాణలో తెలుగు సంవత్సరాది వేడుకలకు ఒక్కరోజు ముందు సీఎం కేసీఆర్ 100 దళిత కుటుంబాల్లో ఉగాది పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం పటాన్చెరులోని మైత్రి గ్రౌండ్స్లో పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లను అందజేసే కార్యక్రమం జరిగింది. అనంతరం జరిగిన సభలో హరీష్ రావు ప్రసంగిస్తూ.. ఈ 100 కుటుంబాలు తెలుగు నూతన సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాయన్నారు. శుక్రవారం వరకు లబ్ధిదారులు కూలీలుగా పనిచేశారని.. దళిత బంధు పథకంతో ఈ 100 కుటుంబాలు యజమానులుగా మారతాయన్నారు. దళితులు కూడా వెనుకబాటుతనం కారణంగా సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నారని, దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 కుటుంబాలకు దళిత బంధు ఫలాలు అందించడమే కాకుండా రాబోయే సంవత్సరంలో 2 లక్షల కుటుంబాలకు దళిత బంధు అందించాలనే లక్ష్యంతో బడ్జెట్లో రూ.17,800 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. దళిత బంధు యూనిట్లను గ్రౌండింగ్ చేసిన సంగారెడ్డి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రి అభినందించారు. ఇప్పటికే నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా దళిత బంధు యూనిట్లను గ్రౌండింగ్ చేశామన్నారు. అంతే కాకుండా ఉగాది తర్వాత త్వరలో గ్రౌండింగ్ కానున్న సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు నియోజకవర్గాల్లో యూనిట్ల ఎంపిక పూర్తయిందని తెలిపారు. దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్లో ఇతర జిల్లాల కంటే సంగారెడ్డి జిల్లా చాలా ముందుందని చెప్పారు.