కేసీఆర్ ప్ర‌చారంలో వాస్త‌వం లేదు.. 165 హామీల్లో 158 ఇప్పటికే అమలు చేస్తున్నాం : కర్ణాటక సీఎం సిద్ధ‌రామయ్య

కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం రెండోసారి వచ్చానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు.

By Medi Samrat  Published on  26 Nov 2023 10:48 AM GMT
కేసీఆర్ ప్ర‌చారంలో వాస్త‌వం లేదు.. 165 హామీల్లో 158 ఇప్పటికే అమలు చేస్తున్నాం : కర్ణాటక సీఎం సిద్ధ‌రామయ్య

కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం రెండోసారి వచ్చానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డి లో ప్రచారం చేసానని వెల్ల‌డించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 5 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేయలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ,కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవం లేదన్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన మొదటి క్యాబినెట్ లోనే 5 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నామ‌ని తెలిపారు.

శక్తి యోజన ద్వారా మొదటి గ్యారంటీ స్కీమ్స్ ని జూన్ 11 న అమలు చేసామ‌ని.. రోజుకు 62 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారని.. నా భార్య, మా మహిళా మంత్రులు కూడా ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారని వివ‌రించారు. కేసీఆర్ ఎన్నికల కోసం అబద్దాలు చెబుతున్నారని అన్నారు.

అన్న భాగ్య ద్వారా ఒకరికి 5 కేజీ ల బియ్యం ఇవ్వాలని హామీ ఇచ్చాం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కర్ణాటకకు బియ్యం ఇవ్వకపోవడం వల్ల ఒక్కో కేజీ కి 34 రూపాయలు చెల్లిస్తున్నాం. బియ్యం ఇవ్వాలని ఫుడ్ కార్పొరేషన్ ఇండియాను రిక్వెస్ట్ చేసామ‌న్నారు. 4 కోట్ల 37 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. జులై మొదటి వారం నుంచి అన్న భాగ్య ని అమలు చేస్తున్నామ‌ని తెలిపారు.

గృహ జ్యోతి పథకాన్ని జులై నుండి అమలు చేస్తున్నామ‌ని.. దీని ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాని తెలిపారు. గృహలక్ష్మి పథకం ద్వారా కోటి 17 లక్షల మంది మహిళలకు 2000 చొప్పున అందిస్తున్నామ‌ని వివ‌రించారు.

4 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తున్నామ‌ని తెలిపారు. 5వ గ్యారంటీ యువనిధి ద్వారా వచ్చే జనవరి నుండి నిరుద్యోగులకు 3 వేలు అందిస్తామ‌ని తెలిపారు. వీటితో పాటు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తామ‌ని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 36 -38 వేల కోట్లు గ్యారంటీ స్కీమ్స్ కి కేటాయించామ‌ని.. వచ్చే సంవత్సరం 58 వేల కోట్లు గ్యారంటీ స్కీమ్స్ కి ఖర్చు చేయ‌బోతున్నామ‌ని వివ‌రించారు. 165 ఇచ్చిన హామీల్లొ ..158 ఇప్పటికే అమలు చేస్తున్నామ‌ని తెలిపారు.

బీజేపీ ఇచ్చిన 600 హామీల‌లో కేవలం 10 శాతం మాత్రమే అమలు చేసింది. మొన్న ప్రచారానికి వచ్చినప్పుడు.. కేసీఆర్ ని కర్ణాటక వచ్చి మేము అమలు చేస్తున్న పథకాలు చూడాలని చెప్పాం. ఇప్పుడు మరోసారి కర్ణాటక రావాలని కేసీఆర్ ని ఆహ్వానిస్తున్నా.. కాంగ్రెస్ ప్రజలను ఎప్పుడు మోసం చేయదు.. ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తుందన్నారు.

కర్ణాటక దివాళ‌ తీస్తుందని మోదీ అంటున్నారు.. అందులో వాస్తవం లేదు. కర్ణాటకలో గ్యారంటీ స్కీమ్స్ అమలు చేయడానికి డబ్బులకు కొదవ లేదన్నారు. 100 శాతం తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామ‌ని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 6 గ్యారంటీ స్కీమ్స్ ఖ‌చ్చితంగా అమలు చేస్తామ‌ని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ఎప్పుడైనా కర్ణాటక రావచ్చని ఆహ్వానం ప‌లికారు.

యడ్యూరప్పని ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించినప్పటి నుండి ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు. యాడ్యూరప్ప ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. బీజేపీపై 40 శాతం కమిషన్ ఆరోపణ కాంగ్రెస్ ది కాదు.. కాంట్రాక్టర్లదన్నారు. ఆ ఆరోపణలపై విచారణ జరిపిస్తున్నామ‌ని తెలిపారు. దశల వారిగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామ‌ని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రాక ముందు రూ.430 గ్యాస్ ఉంటే.. ఇప్పుడు 1200 ఉందన్నారు.

తెలంగాణ లో ధర్నా చేసింది కర్ణాటక రైతులు కాదు.. కర్ణాటక రైతులు ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తారని ప్ర‌శ్నించార. కేసీఆర్ కు భయం పట్టుకుంది.. వాళ్ళు బీఆర్ఎస్ రైతులు అని అన్నారు. డిసెంబర్ 3న కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుంది.. నేను కూడా వస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Next Story