ఢిల్లీ నుంచి రావడం.. ప్రెస్ మీట్ పెట్టడం.. కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టడం.. ఇదే పని..

Kadiyam Srihari Fire On Minister Kishan Reddy. మండలిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరుపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు.

By Medi Samrat  Published on  13 Sep 2022 8:49 AM GMT
ఢిల్లీ నుంచి రావడం.. ప్రెస్ మీట్ పెట్టడం.. కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టడం.. ఇదే పని..

మండలిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరుపై మాజీమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. విభజన చట్టం రూపొందించేటప్పుడే తెలంగాణ కు అన్యాయం జరిగిందని అన్నారు. అన్ని రకాల కేంద్ర విద్యాసంస్థలు ఏపీలో నెలకొల్పేలా చట్టంలో పొందుపరిచారు. తెలంగాణకు ఇచ్చిన ట్రైబల్ యూనివర్సిటీ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క విభజన హామీ నెరవేర్చలేదని దుయ్య‌బ‌ట్టారు. వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి రావాల్సిన అన్నింటినీ దగ్గరుండి ఏపీకి ఇప్పించారు.. తెలంగాణకు ఒక కేంద్ర మంత్రి ఉన్నారు.. ఢిల్లీ నుంచి రావడం.. ఒక ప్రెస్ మీట్ పెట్టడం.. కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టడం.. ఇదే పని అంటూ ఎద్దేవా చేశారు.

కిషన్ రెడ్డి ఢిల్లీలో ఏం చేస్తున్నారు. గడ్డి పికుతున్నారా.? తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు ఉందా.? అంటూ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు కేసీఆర్ ను చూసి భయపడుతున్నారని అన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డికి తెలంగాణ పై చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలు అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని అన్నారు. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు చేతకాని చవటలు, దద్దమ్మలు అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో కులాలు, మతాల మధ్య గోడవలు పెట్టి, మతచిచ్చు మంటల్లో చలి కాచుకుందామంటే తెలంగాణ ప్రజలు సహించర‌ని అన్నారు. బీజేపీ ముక్త్‌ భారత్ కావాలి.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు.




Next Story