బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు సహా పార్టీ ముఖ్య నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు. అస్వస్థతకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మాగంటి గోపీనాథ్ వారం రోజుల క్రితం కూడా ఆసుపత్రిలో చేరారు. కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.