ఐఏఎస్ ఆమ్రపాలికి ఊహించని షాక్...!

తెలంగాణలో కొనసాగుతున్న పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను ఏపీ కేడర్‌కు కేటాయించింది.

By Medi Samrat  Published on  10 Oct 2024 2:13 PM GMT
ఐఏఎస్ ఆమ్రపాలికి ఊహించని షాక్...!

తెలంగాణలో కొనసాగుతున్న పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను ఏపీ కేడర్‌కు కేటాయించింది. ఈ మేరకు ఆయా అధికారులు వెంటనే ఏపీలో రిపోర్ట్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా కొనసాగుతున్న ఆమ్రపాలి కాటకు ఊహించని షాక్ తగిలింది. ఆమ్రపాలి ప్రస్తుతం తెలంగాణలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. 2010 ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి తెలంగాణ కేడర్‌కు పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించగా ఖండేకర్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఆమె అభ్యర్థన తిరస్కరించింది.

విద్యుత్‌ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న రోనాల్డ్‌ రోస్‌, వాణిప్రసాద్‌, వాకాటి కరుణ, మల్లెల ప్రశాంతితో పాటు పలువురు అధికారులను ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, తెలంగాణ కేడర్‌ కావాలంటూ 11 మంది అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే అధికారుల వినతిని కేంద్రం తిరస్కరించింది.

ఆమ్రపాలి కాటా నవంబర్ 4, 1982న భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించారు. విశాఖపట్నంలోని సాయి సత్య మందిర్ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి బి టెక్ చదివారు, ఆ తర్వాత బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి MBA చదివారు. ఆమ్రపాలి 2010 UPSC పరీక్షలో 39వ ర్యాంక్ సాధించారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా నియమితులైన తొలి మహిళా ఐఏఎస్ అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు.

Next Story