42 శాతం బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
By - Knakam Karthik |
42 శాతం బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ: తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కాగా హైకోర్టు ఇచ్చిన స్టేపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు నేడు విచారణ జరపనుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీచేసిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపైనే స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీల రిజర్వేషన్ల భవితవ్యం ఆధారపడి ఉండటంతో అత్యున్నత ధర్మాసనం ఏ తీర్పు ఇస్తుందోనని రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది.
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.కాగా ఈ పిటిషన్ తాజాగా న్యాయస్థానం రిజిస్ట్రీలో లిస్ట్ కావడంతో గురువారం విచారణకు రానున్నది. ఈ పిటిషన్ను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్మెహతా ధర్మాసనం విచారించనున్నది. అయితే ప్రభుత్వ వాదనలు వినడాని కంటే ముందే తమ వాదనలను కూడా పరిగణనలోకి హైకోర్టులో పిటిషనర్ మాధవరెడ్డి ఇప్పటికే కెవియట్ పటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం తెలంగాణ ప్రజలతోపాటు బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. మరో వైపు ఈ నెల 18వ తేదీన బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు అధికార కాంగ్రెస్ పార్టీ సహా, బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు తెలిపాయి.