గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజకీయ నేతలా మాట్లాడుతున్నారు : తలసాని

Guv speaking like a political leader, flays Talasani. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజకీయ నేతలా మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు

By Medi Samrat  Published on  20 April 2022 11:02 AM GMT
గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజకీయ నేతలా మాట్లాడుతున్నారు : తలసాని

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజకీయ నేతలా మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తలసాని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్ మీడియా సమావేశంలో మాట్లాడటం సరికాదన్నారు. బీజేపీ నేతలకు అనుకూలంగా గవర్నర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గవర్నర్ ఏమి మార్చాలి, ఏమి చేయాలి అనే దానిపై చర్చించవచ్చు కానీ ఆమె ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష పార్టీల తరపున మాట్లాడకూడదని కూడా ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు నామినేట్ అవుతారని, అయితే రాష్ట్ర ప్రజలచే ఎన్నుకోబడతారని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఆదేశమిది అని అన్నారు. గవర్నర్ ముందుగా ఆమె విధులపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుతో కలిసి పనిచేయడం ఇష్టం లేదన్న గవర్నర్‌ ప్రకటన సరికాదని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ ప్రకటనలు చేయడం బాధాకరమన్నారు.

అంతకుముందు రాజ్‌భవన్‌లో మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రఘునందన్‌రావు, రామచందర్‌రావు తదితరులు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఖమ్మం బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య కేసు, కామారెడ్డి రామాయంపేట తల్లీ కొడుకుల ఆత్మహత్య కేసుల నివేదికను పార్టీ నేతలు సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ రెండు కేసుల్లో సీబీఐ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ నేతలు.. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త, కామారెడ్డిలో తల్లీకొడుకుల ఆత్మహత్యలపై గవర్నర్‌ను కలిశామన్నారు. ఈ కేసులపై సీబీఐ విచారణ జరిపించాలని నేతలు డిమాండ్ చేసినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ నేతల వేధింపుల వల్లే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. వారి వేధింపులతో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.



















Next Story