Video: తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి.. కాల్పుల కలకలం
హైదరాబాద్లోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ ఆఫీసుపై దాడి జరిగింది.
By అంజి
Video: తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి.. కాల్పుల కలకలం
హైదరాబాద్లోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ ఆఫీసుపై దాడి జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత బీసీ ఉద్యమాన్ని ప్రశ్నిస్తూ.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల తర్వాత నిరసనకారులు ఆయన కార్యాలయంపై దాడి చేయడంతో మేడిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. జాగృతి కార్యకర్తలు, ఎమ్మెల్సీ కవిత అనుచరులు మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై అటాక్ చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కిటికీలు ధ్వంసం చేయబడ్డాయి.
మేడిపల్లిలోని MLC తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాగృతి కార్యకర్తలు మల్లన్న ఆఫీస్పై దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడి తీవ్రతరం అవడంతో గాల్లోకి కాల్పులు జరిపిన మల్లన్న గన్ మెన్.#TeenmarMallanna #Breaking pic.twitter.com/rXhA3dD2x1
— Samrat (@Journo_Samrat) July 13, 2025
వారిని అడ్డుకునేందుకు మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ భీతావహ పరిస్థితి నెలకొంది. కవితపై మల్లన్న అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకే దాడి చేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ మల్లన్నపై దాడికి ఇటీవల ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. ''బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కల్వకుంట్ల కవిత రంగులు పూసుకుంటోంది. ఆమెకు, బీసీలకు ఏం సంబంధం? నువ్వ బీసీనా? కంచం పొత్తు ఉందా? నువ్వు పండగ చేసుకోవడం ఏంటి?'' అని ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడటమే జాగృతి కార్యకర్తల కోపానికి కారణమైనట్టు సమాచారం.