Telangana: రేషన్‌ కార్డులు లేని వారికి ప్రభుత్వం భారీ శుభవార్త

రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. త్వరలోనే రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది.

By అంజి
Published on : 15 Jan 2025 6:39 AM IST

Telangana Government, new ration cards, Telangana, Hyderabad

Telangana: రేషన్‌ కార్డులు లేని వారికి ప్రభుత్వం భారీ శుభవార్త

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. త్వరలోనే రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. కుల గణన సర్వే ద్వారా గుర్తించిన అర్హులైన కుటుంబాలకు కొత్త ఆహారభద్రత (రేషన్) కార్డులను అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. జనవరి 26 నుండి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రేషన్‌ కార్డు ఫిర్యాదులను పరిష్కరించడం, కొత్త రేషన్ కార్డులను పంపిణీని చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ నెల 26 నుండి అర్హులైన కుటుంబాలకు ఆహార భద్రత కార్డులు అందుబాటులో ఉంటాయని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. సోమవారం విడుదల చేసిన మార్గదర్శకాలు లబ్ధిదారులను గుర్తించడంలో పారదర్శకత, న్యాయబద్ధతను నిర్ధారించడానికి జిల్లా కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు, గ్రామసభలతో కూడిన బహుళ-స్థాయి ధృవీకరణ ప్రక్రియను వివరిస్తాయి. రేషన్ కార్డులు లేని కుటుంబాల వివరాలు ఫీల్డ్ వెరిఫికేషన్‌లో తెలుస్తాయి. కొత్త కార్డుల జారీ కోసం తుది ఆమోదించబడిన జాబితా పౌరసరఫరాల శాఖకు సమర్పించబడుతుంది.

Next Story