తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మదర్స్ డే సందర్భంగా తల్లులందరికీ ప్రత్యేక ఆఫర్ను అందజేస్తోంది. ఆఫర్లో భాగంగా.. టీఎస్ఆర్టీసీ ఐదేళ్లలోపు పిల్లలతో ప్రయాణించే తల్లులకు ఏసీ సర్వీసుల్లో సహా అన్ని బస్సు సర్వీసుల్లో ఉచిత సేవల ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఆఫర్ను మే 8 ఆదివారం నాడు వినియోగించుకోవచ్చని ప్రకటనలో తెలిపింది.
టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ ఈ సందర్భంగా తల్లులందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు. మనల్ని ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చిన అద్భుతమైన మహిళలందరికీ మన ప్రేమ, గౌరవాన్ని అందించడానికి మాతృ దినోత్సవం గొప్ప సమయం అని అన్నారు.