రాష్ట్రంలో నలుగురు ఆర్టీఐ కమిషనర్లు నియామకం

రాష్ట్రంలో నలుగురు ఆర్టీఐ కమిషనర్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By Knakam Karthik
Published on : 12 May 2025 4:05 PM IST

Telangana, Congress Government, Four RTI Commissioners appointed

రాష్ట్రంలో నలుగురు ఆర్టీఐ కమిషనర్లు నియామకం

రాష్ట్రంలో నలుగురు ఆర్టీఐ కమిషనర్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్లుగా పీవీ శ్రీనివాస రావు, మొహసినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణ రావు పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కాగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ నలుగురిని గవర్నర్ రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియమించారు. వీరు మూడేళ్ల పాటు ఆ పదవుల్లో కొనసాగుతారు. కాగా ఇదే ఫైల్ పెండింగ్‌లో ఉండటంతో సోమవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మను కలిసి మాట్లాడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో రాజ్ భవన్ క్లియరెన్స్ ఇచ్చింది.

Next Story