తెలంగాణలో ఘోర బస్సు ప్రమాదం..నలుగురు స్పాట్ డెడ్

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

By -  Knakam Karthik
Published on : 13 March 2026 10:18 AM IST

Telangana, Nizamabad, Road Accident, Bus Crash, Four Killed

తెలంగాణలో ఘోర బస్సు ప్రమాదం..నలుగురు స్పాట్ డెడ్

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి నాగ్‌పూర్‌కు 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటన తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరగడంతో, ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్న సమయంలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని టోల్ ప్లాజా సిబ్బంది స్పందించి క్షతగాత్రులను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Next Story