తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జగిత్యాల జిల్లా మొగిలిపేట శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు రైతు కూలీలు ఘటనాస్థలంలోనే చనిపోయారు. కాగా అందులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు మెట్పల్లి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.