మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. అంతకుముందు కోకాపేట్లోని తన నివాసం నుంచి తెలంగాణ భవన్కు భారీ ర్యాలీతో వెళ్లారు. అనంతరం అక్కడ నుంచి కూడా భారీ ర్యాలీగా బీఆర్కే భవన్కు బయలుదేరారు. హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్కే భవన్కు వెళ్లారు.
అయితే కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు హాజరయ్యారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న విచారణ కమిషన్ ఆయన్ను ప్రశ్నిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ పియర్స్ కుంగిన, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో బుంగలు బయటపడిన నేపథ్యంలో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఈ విచారణ కమిషన్ను నియమించింది. గత ప్రభుత్వంలో కీలకమైన కేసీఆర్, హరీశ్రావు విచారణకు హాజరు కావాలని కమిషన్ ఇటీవల నోటీసులు జారీ చేసింది.