సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే.. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేకతలివే

Features of Vande Bharat Express train running between Secunderabad-Visakha. హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి కానుకగా.. జనవరి 15న సికింద్రాబాద్

By అంజి  Published on  12 Jan 2023 11:22 AM GMT
సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే.. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేకతలివే

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి కానుకగా.. జనవరి 15న సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే హైస్పీడ్ 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. జనవరి 15న ప్రధానమంత్రి ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రారంభ సమయానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రులు కిషన్‌రెడ్డి, కేంద్ర ఐటీ, టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హాజరుకానున్నారు.

ఇది భారతదేశపు ఆరవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఇది గరిష్టంగా 140-150 kmph కమర్షియల్‌ స్పీడ్‌తో 8-9 గంటల్లో 700 కి.మీ ప్రయాణిస్తుంది. ఇది సికింద్రాబాద్‌ - విశాఖ మధ్య ప్రయాణ సమయాన్ని 12-14 గంటల నుండి 8 గంటలకు తగ్గిస్తుంది.

ఈ రైలును మొదట జనవరి 19న ప్రారంభించాలని భావించారు. అయితే మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా వేయడంతో అది పాజ్ చేయబడింది. తాజా వార్తల ప్రకారం.. అధికారులు సంక్రాంతి నుండి ముందస్తుగా రైలును ఆపరేట్ చేయాలని ప్లాన్ చేశారు.

ట్రయల్ రన్:

జనవరి 11న రైలు నిర్వహణ, ట్రయల్ రన్ నిమిత్తం విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు వచ్చింది.

దురదృష్టవశాత్తు, జనవరి 11న వైజాగ్‌లో వందేభారత్ రైలు నిర్వహణ సమయంలో గుర్తుతెలియని దుండగులు దానిపై రాళ్లతో దాడి చేశారు. డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్ సత్పతి విచారణ ప్రారంభించారు. ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. మర్రిపాపెంలోని కోచ్‌ కేర్‌ సెంటర్‌లో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి.

తాత్కాలిక షెడ్యూల్:

ఈ రైలు వైజాగ్ నుంచి ఉదయం 5.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలుకు రాజమండ్రి, విజయవాడ, వరంగల్‌లో హాల్ట్‌లు ఉంటాయి.

ఈ రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.25 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది.

ఈ రైలు ప్రతిరోజు సర్వీసులను నడపనుంది. రైల్వే అధికారులు ప్రాథమికంగా స్టేషన్లలో మరిన్ని హాల్ట్‌లను ప్లాన్ చేశారు. అయితే ప్రయాణ సమయం పెరుగుతుందని, వారు కేవలం మూడు స్టేషన్‌లకు మాత్రమే హాల్ట్‌లను పరిమితం చేశారు. వైజాగ్ నుండి సికింద్రాబాద్ వరకు నడిచే రైళ్లతో పోలిస్తే, దాదాపు మూడు గంటలు ఆదా చేసే అత్యంత వేగవంతమైన రైలు ఇది.

ఉదాహరణకు, గరీబ్ రథ్ (11.10 గంటలు), ఫలక్‌నామా (11.25 గంటలు), గోదావరి (12.05 గంటలు), ఈస్ట్ కోస్ట్ (12.40 గంటలు), జన్మభూమి (12.45 గంటలు).

ఫీచర్స్‌

-1,128 సీట్ల సామర్థ్యంతో 16 కోచ్‌లతో ఏసీ రైలు

-రైలులో వేగాన్ని తగ్గించే ఇంటెలిజెంట్‌ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది.

-వందే భారత్ రైళ్లు గంటకు 0-100 కి.మీ వేగాన్ని 52 సెకన్లలో అందుకోగలవు, టాప్-అప్ వేగం గంటకు 180 కి.మీ.

-అన్ని కోచ్‌లలో ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్‌-ఆధారిత ఆడియో-విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లు, డైవింగ్-ఫ్రెండ్లీ సౌకర్యాలు ఉంటాయి.

-వినోద ప్రయోజనాల కోసం బోర్డులో హాట్‌స్పాట్ వైఫై.

-ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో తిరిగే కుర్చీలు ఉంటాయి.

-బయో-వాక్యూమ్ మోడల్ టాయిలెట్లు

-పాంట్రీ సౌకర్యం భోజనం, పానీయాలను అందిస్తుంది

భవిష్యత్తు ప్రణాళికలు:

వందేభారత్ రైలు సర్వీసులను తిరుపతి వరకు పొడిగించే అవకాశాలను కూడా అధికారులు చూస్తున్నారు. సికింద్రాబాద్-తిరుపతి నుంచి రైలు నడపినట్లయితే, విజయవాడ నుండి ప్రయాణీకుల రద్దీ, సమయం తగ్గుతుంది.

వందే భారత్ రైళ్లు ప్రస్తుతం న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-కత్రా, ముంబై సెంట్రల్-గాంధీనగర్, న్యూఢిల్లీ-అంబ్ అందౌరా మరియు MGR చెన్నై సెంట్రల్-మైసూరు మార్గాల్లో నడుస్తున్నాయి.

Next Story