రేవంత్ రెడ్డి మెద‌డు నిండా విషం త‌ప్ప విజ‌న్ లేదు : హ‌రీశ్‌రావు

బడికి పోయే పిల్లల నుంచి మొదలుకుంటే పెన్షన్ తీసుకునే వృద్ధుల వరకు అందర్నీ రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.

By Kalasani Durgapraveen  Published on  28 Oct 2024 1:39 PM GMT
రేవంత్ రెడ్డి మెద‌డు నిండా విషం త‌ప్ప విజ‌న్ లేదు : హ‌రీశ్‌రావు

బడికి పోయే పిల్లల నుంచి మొదలుకుంటే పెన్షన్ తీసుకునే వృద్ధుల వరకు అందర్నీ రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి మెదడులో విషం తప్ప విజన్ లేదన్నారు. తెలంగాణ భవన్ లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఉద్యోగులును, నిరుద్యోగులను, ఇతర వర్గాలను అందర్నీ మోసం చేసి ఇవాళ ప్రతిపక్షంపై దాడులకు పాల్పడుతున్నారు. ప్రజా సమస్యలపై నిలదీస్తే.. బీఆర్ఎస్ పార్టీ మీద దాడులకు తెగబడుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర ఆదాయం పడిపోయిందంటే.. రేవంత్ కు పరిపాలన చేయడం చేతకాక పోవడం వల్లనే అని అన్నారు.

ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ..కాంగ్రెస్ సర్కార్ ను నిలదీస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు రేవంత్ రెడ్డి.. ఏదో రకంగా బురద జల్లేందుకు, ప్రజల్లో ఆలోచనలు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. రుణమాఫీ మీద నిలదీస్తే వికృతంగా నా గురించి మాట్లాడిండు రేవంత్ రెడ్డి.. కేటీఆర్ మూసీ ప్రాజెక్టు విషయంలో నీ అవినీతిని బట్టయబలు చేయడంతో.. దృష్టి మరల్చడానికి కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని దాడి చేసే ప్రయత్నం చేస్తున్నావ్.. ఇది షేమ్.. రాజకీయంగా కొట్లాడు.. నేరుగా కొట్లాడమ‌ని సూచించారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంటే.. సమాధానం చెప్పకుండా రేవంత్ రెడ్డి దాడులకు పాల్పడుతున్నాడు. మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొట్టడానికి వ్యతిరేకం అని.. అవినీతికి వ్యతిరేకం అని కేటీఆర్‌ చెప్పారు. పేదల హక్కుల కోసం కేటీఆర్ కొట్లాడిండు కాబట్టి ఆయన మీద బురద జల్లలాలని ఆయన క్యారెక్టర్ను దెబ్బతీలయాని కుట్ర చేస్తున్నావు. కానీ అట్టర్ ప్లాఫ్ అయ్యావు.. ప్రజలు నీ డ్రామాను అర్థం చేసుకున్నారని అన్నారు.

ఇవాళ రాష్ట్రంలో ప్రతీ వర్గం రోడ్డెక్కింది. పురుగులు లేని అన్నం కోసం గురుకుల విద్యార్థులు రోడ్డెక్కారు. స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, రైతుబంధు, రుణమాఫీ కోసం రైతులు, జీతాల కోసం అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, పంచాయతీలకు నిధులు విడుదల చేయాలనీ జీపీ సిబ్బంది, ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తూ నీ సొంత నియోజకవర్గం కొడంగల్ ప్రజలు, మా సమస్యలు పరిష్కరించండని.. పోలీసులు,పెన్షన్ల కోసం వృద్ధులు.. ఇలా అందరూ రోడ్డెక్కుతున్నారన్నారు. పదేండ్ల పాటు అన్ని వర్గాలను కేసీఆర్ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటే.. పది నెలల పాలనలోప్రజలని రోడ్డెక్కించిన చరిత్ర నీది అని రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు మండిపడారు.

Next Story