ద్రోహ చరిత్ర ఆయ‌న‌ది‌‌.. త్యాగ చరిత్ర బీఆర్ఎస్‌ది : హరీష్ రావు

పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకున్నారని.. తెలంగాణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం తప్పు.. అందుకే సీఎం స్పీచ్‌ను బహిష్కరించామని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

By Medi Samrat  Published on  15 March 2025 3:25 PM IST
ద్రోహ చరిత్ర ఆయ‌న‌ది‌‌.. త్యాగ చరిత్ర బీఆర్ఎస్‌ది : హరీష్ రావు

పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకున్నారని.. తెలంగాణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం తప్పు.. అందుకే సీఎం స్పీచ్‌ను బహిష్కరించామని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల 299 టీఎంసీల నీటి పంపకాలు చేశారు.. 299 టీఎంసీల నీటి వినియోగం కంటే ఎక్కువ ప్రాజెక్టులు లేవు.. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి.. 299 టీఎంసీల నీరు తాత్కాలికంగా కేటాయించారు.. ప్రాజెక్టులు కట్టని పాపం కాంగ్రెస్‌దే.. ఢిల్లీలో రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ వెళ్లి ఎందుకు ఒప్పుకొని వచ్చారని ప్ర‌శ్నించారు. పోతిరెడ్డిపాడు కోసం పీజేఆర్ కొట్లాడాడని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవుల కోసం పెదవులు మూసుకున్నాడని విమ‌ర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్క రోజు కూడా వ్యతిరేకించలేదు.. 40 రోజులు అసెంబ్లీని స్తంభింపచేశాం.. తెలంగాణ కోసం మేము ఆ రోజు 6 మంత్రి పదవులు వదులుకున్నాం.. ఉత్తమ్ చంద్రబాబు దగ్గరకు వెళ్లి భోజనం చేసి వచ్చారు.. కృష్ణా నీటిలో తెలంగాణకు అన్యాయం చేశారు.. ఆ తర్వాత శ్రీశైలం ఖాళీ చేసే లాగా ద్రోహం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఆరోపించారు. సెక్షన్ 3ని సాధించింది కేసీఆర్.. 573 టీఎంసీల నీళ్లు సెక్షన్ 3 ద్వారా తెచ్చింది మేము.. ద్రోహ చరిత్ర ఉత్తమ్‌ది‌‌.. త్యాగ చరిత్ర బీఆర్ఎస్‌ది అని పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై స్టే తెచ్చింది బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. నల్గొండలో పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ కారణం అన్నారు.. కృష్ణా నీళ్లను సముద్రంలో కలిపార‌న్నారు. కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు కట్టడం వల్ల ఖమ్మంకి నీళ్లు ఇవ్వగలిగామ‌న్నారు. హుజూర్‌నగర్‌ని ముంపుకు గురి చేసి ఆంధ్రాలో మూడో పంటకు నీళ్లు ఇచ్చారు.. పులిచింతల నిర్వాసితులకు వందల కోట్ల రూపాయలు ఇచ్చి కాపాడుకున్నామ‌న్నారు.

Next Story