విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై కొత్త చట్టం

English medium in govt. schools from next year. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల

By Medi Samrat
Published on : 17 Jan 2022 8:01 PM IST

విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై కొత్త చట్టం

వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ప్రగతి భవన్‌లో ఈరోజు జరిగిన రాష్ట్ర మంత్రిమండ‌లి స‌మావేశంలో నిర్ణయించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సోమ‌వారం మ‌ధ్యాహ్నం జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, ఫీజుల నియంత్రణపై సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. మంత్రులు కేటీ రామారావు, హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీష్‌రెడ్డి సభ్యులుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కమిటీని ఏర్పాటు చేశారు. 'మన ఊరు-మన బడి' కార్యక్రమం కింద మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్ర‌భుత్వం రూ.7,289 కోట్లు కేటాయించింది.


Next Story