ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధం కావాలి

District police should be prepared to ensure smooth conduct of elections. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు

By Medi Samrat  Published on  27 Jun 2023 2:00 PM GMT
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధం కావాలి

రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం సన్నద్ధం కావాలని ఖ‌మ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, క్షేత్రస్థాయిలో సిబ్బంది మోహరింపుపై అధికారుల్లో పూర్తి స్పష్టత ఉండాలని సూచించారు.

మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో వారియర్ మాట్లాడుతూ.. సున్నితమైన, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల గుర్తింపు విషయంలో అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన పాత నేరాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్‌తో పాటు ఎప్పటికప్పుడు తనిఖీలు అవసరమని సీపీ నొక్కి చెప్పారు. నిషేధిత పదార్థాల అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఏసీపీలు జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను తరచూ సందర్శించాలన్నారు.

జిల్లాలో జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కృషి చేయాలి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడేందుకు రోడ్డు పక్కనే ఉన్న పెట్రోల్ బంకులు, హోటళ్లు, దుకాణాలు, దాబాల యజమానులకు ప్రథమ చికిత్స, సీపీఆర్‌పై అవగాహన కల్పించడంతోపాటు అత్యవసర, వైద్య సేవలకు సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో 163 ​​కేంద్రాల్లో నిర్వహించనున్న గ్రూప్‌-4 పరీక్షలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని వారియర్‌ తెలిపారు. సమావేశంలో ట్రైనీ ఏఎస్పీ అవినాష్ కుమార్, అదనపు డీసీపీలు సుభాష్ చంద్రబోస్, కుమార స్వామి, ఏసీపీలు ప్రసన్నకుమార్, గణేష్, బస్వా రెడ్డి, రెహమాన్, రామానుజం, వెంకటస్వామి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


Next Story