డిసెంబర్ 7న సీపీఐ రాజ్ భవన్ ముట్టడి

CPI to lay siege to Raj Bhavan on December 7. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 7న రాజ్ భవన్ ముట్టడి చేయాలని

By Medi Samrat  Published on  18 Nov 2022 3:00 PM GMT
డిసెంబర్ 7న సీపీఐ రాజ్ భవన్ ముట్టడి

గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 7న రాజ్ భవన్ ముట్టడి చేయాలని సీపీఐ రాష్ట్ర విభాగం నిర్ణయించింది. రాష్ట్ర పాలనలో గవర్నర్ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.సాంబశివరావు శుక్రవారం అన్నారు. మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఒక్కటే ప్రత్యామ్నాయమని చెబుతోంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాడర్ లేని బీజేపీ, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ బలం ఉన్న సీపీఐ సామర్థ్యాలను ప్రశ్నించ‌డంపై ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీపీఐ సిద్ధమైంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే 25 నియోజకవర్గాల్లో పార్టీకి కంచుకోటగా ఉన్న వాటిని గుర్తించామని తెలిపారు. మునుగోడు ఉపఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌తో ఏర్పడిన పొత్తును భవిష్యత్తులోనూ వివిధ ప‌రిమితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కొనసాగిస్తామని చెప్పారు. కాగా చిత్రపురి హౌసింగ్ సొసైటీలో రూ.300 కోట్ల అక్రమాలు జరిగాయని, సొసైటీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు.


Next Story