రేపు జడ్చర్లలో కాంగ్రెస్ పీపుల్స్ మార్చ్ బహిరంగ సభ

Congress People's March public meeting in Judcharla tomorrow. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా గురువారం సాయంత్రం

By Medi Samrat  Published on  24 May 2023 11:30 AM GMT
రేపు జడ్చర్లలో కాంగ్రెస్ పీపుల్స్ మార్చ్ బహిరంగ సభ

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా గురువారం సాయంత్రం కాంగ్రెస్ భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నుంది. జడ్చర్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పీపుల్స్ మార్చ్ బహిరంగ సభ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. 4 గంటలకు ప్రారంభ‌మ‌య‌యే స‌భావేదిక‌కు రాజీవ్ గాంధీ సభా ప్రాంగణంగా నామ‌క‌ర‌ణం చేశారు. ఈ స‌భ‌కు ముఖ్య అతిధిగా హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్ హాజ‌రుకానున్నారు. అలాగే ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు కూడా ఈ స‌భ‌లో పాల్గొననున్నారు. కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు అధిక సంఖ్య‌లో పాల్గొని స‌భ‌ను విజయవంతం చేయాలని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ మ‌హేష్ కుమార్ గౌడ్ కోరారు.




Next Story