ఆ సమస్యను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది

Congress neglected fluorosis problem in Munugode. సూర్యాపేట జిల్లాతో సమానంగా మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని

By Medi Samrat  Published on  25 July 2022 9:53 AM GMT
ఆ సమస్యను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది

సూర్యాపేట జిల్లాతో సమానంగా మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఇంధన శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సోమవారం అన్నారు. గట్టుప్పల్ మండల సాధన కమిటీ అధ్యక్షుడు కైలాసం తదితరులను టీఆర్‌ఎస్‌లోకి స్వాగతించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేకు అనేక వ్యాపారాలు ఉన్నాయని, నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు.

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ నేతల ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు అనుగుణంగా ఫ్లోరోసిస్ కూడా పెరిగిందని మంత్రి విమ‌ర్శించారు. కాంగ్రెస్‌ను మోసపూరిత పార్టీగా ప్రజలు గుర్తించారని, అందుకే తెలంగాణ సమాజం మొత్తం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో టీఆర్‌ఎస్ వెంట ఉంద‌ని మంత్రి అన్నారు.

గట్టుప్పల్ మండల ఏర్పాటు ప్రజల కల అని, ముఖ్యమంత్రి కలను నెరవేర్చారని, మునుగోడులో వ్యాపించిన ఫ్లోరోసిస్ వ్యాధి నివారణకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరోసిస్ సమస్యను ముఖ్యమంత్రి పరిష్కరించారన్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు చేసిన సర్వేల్లో ఫ్లోరోసిస్ కేసులు నమోదు కాలేదని, ఆ ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని విస్మరించారని మంత్రి ఆరోపించారు.














Next Story