నన్ను ఎందుకు పక్కన పెట్టారు.. ? ఎంపీగా పోటీ చేసి తీరుతా : వీహెచ్‌

ఎంపీగా పోటీ చేసి తీరుతానన‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు అన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  26 Feb 2024 10:05 AM GMT
నన్ను ఎందుకు పక్కన పెట్టారు.. ? ఎంపీగా పోటీ చేసి తీరుతా : వీహెచ్‌

ఎంపీగా పోటీ చేసి తీరుతానన‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు అన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నా.. ఖమ్మం ప్రజలకు జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశాను.. ఖమ్మం నుండి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ నన్ను అడుగుతున్నారని వీహెచ్ అన్నారు. పార్టీ కోసం నా కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా.? ఇండియాలో నాకంటే ఎక్కువ తిరిగే నాయకుడు ఉన్నారా.? అని వీహెచ్‌ ప్ర‌శ్నించారు.

రేవంత్ పై నాకు నమ్మకం ఉంది.. నేనేం తప్పు చేశాను. నన్ను ఎందుకు పక్కన పెట్టారని వాపోయారు. కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్లు అడిగితే నా లాంటి సీనియర్ల పరిస్థితి ఎంటి? అని ప్ర‌శ్నించారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ తొలగించాలి.. లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగిందన్నారు.

మోదీకి సముద్రం లోపలికి వెళ్లి పూజలు చేయడానికి టైం ఉంది.. కానీ మణిపూర్ వెళ్ళడానికి టైం లేదన్నారు. ఏం ఉద్దరించారని బీజేపీ నాయ‌కులు సంకల్ప యాత్ర చేస్తున్నారని ప్ర‌శ్నించారు. రాముడిని మేమే పుట్టించామని సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు.. దేవుడి పేరుపై ఓట్లు సంపాదించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.. బీజేపీ నేతలు భాష మార్చుకోవాలని సూచించారు. ఇప్పటికైనా ప్రధాని మణిపూర్ వెళ్ళాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీని గుడికి రానివ్వడం లేదు... గుడులు మీ అయ్య జాగీర్లా.? అని ప్ర‌శ్నించారు.

Next Story