కేటీఆర్‌, ఈటల కోడ్‌ ఉల్లంఘించారని.. ఈసీకి కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ ఫిర్యాదు

కేటీఆర్‌, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని కాంగ్రెస్‌ నేత జీ నిరంజన్‌ భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

By అంజి  Published on  13 May 2024 10:47 AM GMT
Congress, G Niranjan, Election Commission, KTR , Etala Rajender, Poll code

హైదరాబాద్‌: సోమవారం లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ రోజున బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని కాంగ్రెస్‌ నేత జీ నిరంజన్‌ భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఓట్లు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరు నేతలు పోల్ కోడ్‌ను ఉల్లంఘించారని టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ జి నిరంజన్‌.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కి లేఖ రాశారు.

సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం నందిహిల్స్‌ పోలింగ్‌ కేంద్రంలో కేటీఆర్‌ ఓటు వేశారు. కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ 'తాను పార్టీకి, ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడికి అనుకూలంగా ఓటు వేశానని' చెప్పారని, అలాగే ఓటర్లకు విజ్ఞప్తి చేశారని నిరంజన్ ఆరోపించారు. కేటీఆర్‌ ప్రకటనలు ఓటింగ్‌ గోప్యతకు, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసీసీ) ఉల్లంఘనకు విరుద్ధమని నిరంజన్‌ అన్నారు.

అలాగే కాంగ్రెస్‌ నేత ఈటల రాజేందర్‌ ఓటు వేసిన తర్వాత ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలోని మేడ్చల్‌లోని గూడూరులో బీజేపీ అభ్యర్థి ఓటు వేశారు. ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకంగా యావత్ దేశం 'ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్' నినాదం ఇస్తోందని మీడియాతో ఈటల చెప్పారని నిరంజన్ ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించినందుకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.

Next Story