సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల (బీసీ)లను మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు వీ.శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. హామీ ఇచ్చిన విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయకుండానే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు ప్రకటించడం బీసీలకు తీవ్ర అన్యాయమని శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళికలపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అవుతుందని అన్నారు. సోమవారం నిర్వహించే కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీపై క్లారిటీ ఇస్తామని మంత్రి తెలిపారు.