సోనియా గాంధీ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కాంగ్రెస్ నేతల పూజ‌లు

Cong leaders offer prayers at Bhagya Lakshmi temple. తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం నాడు చార్మినార్ ద‌గ్గ‌ర ఉన్న‌ భాగ్యలక్ష్మి

By Medi Samrat  Published on  3 Jun 2022 9:09 AM GMT
సోనియా గాంధీ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కాంగ్రెస్ నేతల పూజ‌లు

తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం నాడు చార్మినార్ ద‌గ్గ‌ర ఉన్న‌ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిన నేప‌థ్యంలో త్వరగా కోలుకోవాలని పూజ‌లు చేశామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్)తో కాంగ్రెస్‌కు రహస్య అవగాహన ఉందని, ఎంఐఎం తో కలిసి చార్మినార్ నుండి ఆలయాన్ని తొలగించాలని ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ చేసిన ఆరోపణను కాంగ్రెస్ నేత‌లు తోసిపుచ్చారు.

బండి సంజయ్ ఇక్కడికి రాక‌ముందు నుండే తాము ఆలయంలో ప్రార్థనలు చేస్తున్నామని భ‌ట్టి విక్రమార్క విలేకరులతో అన్నారు. ఈ దేవాలయం బీజేపీకి లేదా బండి సంజయ్‌కు ఆస్తి కాదని ఆయన అన్నారు. వివాదాలు సృష్టించి రాజకీయ మైలేజీని పొందేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నేత వీ హనుమంతరావు, ఎమ్మెల్యే సీతక్క తదితరులు ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేశారు.











Next Story