కల్న‌ల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణ

Colonel Santosh Babu Statue. భారత్‌-చైనా సరిహద్దు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబ‌డి గతేడాది జూన్‌ 15న చైనా సైనికులతో

By Medi Samrat  Published on  15 Jun 2021 12:01 PM GMT
కల్న‌ల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణ

భారత్‌-చైనా సరిహద్దు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబ‌డి గతేడాది జూన్‌ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమ‌రుడైన కల్న‌ల్‌ సంతోష్‌ బాబు విగ్ర‌హాన్ని నేడు సూర్యాపేట‌లో ఆవిష్క‌రించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్‌బాబు వీరోచిత పోరాట స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోయేలా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సూర్యాపేట కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కల్న‌ల్‌ సంతోష్‌ బాబు 9 అడుగుల‌ కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర‌ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు.

ఇదిలావుంటే.. కల్న‌ల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర‌ ప్రభుత్వం త‌రుపున‌ 5 కోట్ల రూపాయాల ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు.. సీఎం కేసిఆర్ స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం సంతోష్‌బాబు భార్యకు ప్రభుత్వ ఉద్యోగం క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీచేయ‌డంతో పాటు.. ఇంటి స్థలాన్ని కూడా ప్ర‌క‌టించారు.


Next Story