తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకోనున్నారు. అనంతరం లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి-కుర్దు ఆర్&బి బ్రిడ్జ్ను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. బుడిగిడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను సీఎం పరిశీలిస్తారు. కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను, జిఆర్ కాలనీని సీఎం సందర్శిస్తారు. అనంతరం కామారెడ్డి IDOCలో ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించి వరద నష్టంపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు.