ఆర్ఐడీఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నా బార్డ్ ఛైర్మన్ షాజీ కేవీను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని నివాసంలో సీఎంను నా బార్డ్ ఛైర్మన్ కలిశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పలు చర్చలు జరిగాయి. మైక్రో ఇరిగేషన్కు నిధులు ఇవ్వాలని నా బార్డ్ ఛైర్మన్ను సీఎం రేవంత్ కోరారు. కో-ఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని నా బార్డు ఛైర్మన్కు సీఎం విజ్ఞప్తి చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని సీఎం కోరారు.
ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నా బార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నా బార్డ్ స్కీమ్స్ నిధులు మార్చి 31వ తేదీలోగా ఉపయోగించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. నా బార్డు పరిధిలోని స్కీములన్నింటినీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీలైనంత ఎక్కువ ఉపయోగించుకోవాలని సీఎం ఆదేశించారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించే సోలార్ ప్లాంట్స్ నిర్వహణను నా బార్డును అనుసంధానం చేయాలని సూచించారు. కొత్త గ్రామ పంచాయతీలకు రూరల్ కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నా బార్డ్ ఛైర్మన్కు విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాల్లో కొన్ని డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి నా బార్డు ఛైర్మన్ ప్రతిపాదించారు.