సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు.. జవాన్ల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి: కేంద్రమంత్రి

CM KCR’s remakrs hurting sentiments of Army jawans: Kishan Reddy. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. నియంతగా ఎవరు వ్యవహరించినా ప్రజలు

By అంజి  Published on  15 Feb 2022 8:23 AM GMT
సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు.. జవాన్ల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి: కేంద్రమంత్రి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. నియంతగా ఎవరు వ్యవహరించినా ప్రజలు చూస్తూ ఉరుకోరని అన్నారు. నిజాంల సీఎం కేసీఆర్‌ తన పాలన సాగించాలని చూస్తున్నారని, తన వంశం అధికారంలో ఉండాలని అనుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. మోడీ ప్రభుత్వం గత ఏడేళ్లలో ఏం చేసిందో చర్చకు సిద్ధమని, సీఎం సవాల్‌ స్వీకరిస్తున్నానని కిషన్‌ రెడ్డి అన్నారు. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడుతున్న ఆర్మీ జవాన్ల మనోభావాలను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యలు ఉన్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి మంగళవారం అన్నారు.

ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పేందుకు భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్‌కు మద్దతుగా సాక్ష్యాధారాలు కావాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ.. భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసిందని పాకిస్థాన్ స్వయంగా ప్రకటించిందని అన్నారు. సర్జికల్ స్ట్రైక్ తర్వాత ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌ల వద్ద జరిగిన నష్టాన్ని తెలిపే అనేక వీడియోలు బయటపడ్డాయి. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి ముఖ్యమంత్రి ఏమి సాక్ష్యంగా చెబుతున్నారో చెప్పాలని రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలు భారత సైన్యం నైతికతను కించపరిచేలా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వానికి శత్రువులు లేరని స్పష్టం చేశారు. "బీజేపీకి రాజకీయ పార్టీలు ప్రత్యర్థులు మాత్రమే కానీ శత్రువులు కాదని. మా ప్రభుత్వానికి పాకిస్తాన్ మాత్రమే శత్రువు" అని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.

Next Story